కోవూరు ఉప ఎన్నికల ఫలితంపై ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమారెడ్డి, ప్రతిపక్షనేత ఎన్ చంద్రబాబునాయుడుజరిపించుకున్న సర్వేల్లో మింగుడుపడని ఫలితాలు వచ్చినట్టు తెలిసింది. తమకు అత్యంత నమ్మకమైన ప్రభుత్వ ఉద్యోగులతో ఈ సర్వే జరిపించారు. ఎవరికి వారు జరిపించుకున్న సర్వే ఫలితాలు తమకు వ్యతిరేకంగా ఉన్నట్టు స్పష్టంగా తెలియజేశాయి. ముఖ్యమంత్రి సూచనల మేరకు రెవెన్యూ వర్గాలు ఒక సర్వే జరిపించినట్టు ఉన్నతస్థాయి అధికారుల్లో ప్రచారం జరుగుతోంది. న్యూస్లైన్ ప్రతినిధి సేకరించిన సమాచారాన్ని బట్టి ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తెలిసింది.
సేకరించిన శాంపిల్స్లో 65 శాతానికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లాకు చెందిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఒక సర్వే జరిపించారు. ప్రభుత్వ సర్వీసుల్లోని పార్టీ సానుభూతిపరులను ఈ రహస్య సర్వేకు వినియోగించుకున్నారు.
ఈ సర్వే ఫలితాలు కూడా తెలుగుదేశానికి నిరాశ కలిగించేవేనని తెలిసింది. ఆ పార్టీకి అంతోఇంతో ఓట్లు రాలుస్తాయని ఆశించిన బుచ్చిరెడ్డిపాళెంం, ఇందుకూరుపేట మండలాల్లోనూ చేదు ఫలితాలు వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీ పరిస్థితి కొద్దిగా మొరుగ్గా ఉన్నట్టు ఈ సర్వే ఫలితాల్లో వెల్లడైనట్టు చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి జరుపుతున్న కోవూరు ఉప ఎన్నికల ప్రచారం తీరు, జనం హాజరుపై కూడా చంద్రబాబు ఆరా తీయిస్తున్నారు. సర్వేకు ఉపయోగించిన బృందాలను జగన్ పర్యటించే సమయంలోనే పంపుతున్నారు. అక్కడికి వచ్చిన వారి నుంచి రకరకాల ప్రశ్నలతో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా దివంగత నేత రాజశేఖరరెడ్డిపై ప్రజల్లో ఉన్న కృతజ్ఞతాభావంపై గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
సేకరించిన శాంపిల్స్లో 65 శాతానికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లాకు చెందిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఒక సర్వే జరిపించారు. ప్రభుత్వ సర్వీసుల్లోని పార్టీ సానుభూతిపరులను ఈ రహస్య సర్వేకు వినియోగించుకున్నారు.
ఈ సర్వే ఫలితాలు కూడా తెలుగుదేశానికి నిరాశ కలిగించేవేనని తెలిసింది. ఆ పార్టీకి అంతోఇంతో ఓట్లు రాలుస్తాయని ఆశించిన బుచ్చిరెడ్డిపాళెంం, ఇందుకూరుపేట మండలాల్లోనూ చేదు ఫలితాలు వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీ పరిస్థితి కొద్దిగా మొరుగ్గా ఉన్నట్టు ఈ సర్వే ఫలితాల్లో వెల్లడైనట్టు చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి జరుపుతున్న కోవూరు ఉప ఎన్నికల ప్రచారం తీరు, జనం హాజరుపై కూడా చంద్రబాబు ఆరా తీయిస్తున్నారు. సర్వేకు ఉపయోగించిన బృందాలను జగన్ పర్యటించే సమయంలోనే పంపుతున్నారు. అక్కడికి వచ్చిన వారి నుంచి రకరకాల ప్రశ్నలతో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా దివంగత నేత రాజశేఖరరెడ్డిపై ప్రజల్లో ఉన్న కృతజ్ఞతాభావంపై గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
0 comments:
Post a Comment