టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని కోవూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. జొన్నవాడలో కొలువుదీరిన మల్లికార్జునస్వామిని గురువారం ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవూరు ఉప ఎన్నికలో ప్రజలు అవినీతికి ఓటు వేశారని చంద్రబాబు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. అవినీతికి, నీతికి జరిగిన కోవూరు ఉప ఎన్నికలో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా నీతికి పట్టం కట్టారన్నారు.
ఓటుకు రూ. 500 నుంచి రూ.800 ఓ పార్టీ, మరో పార్టీ రూ.1,000 నుంచి రూ.1,500 ఖర్చు పెట్టినా ప్రజలు తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీ రూ.20 కోట్లు, టీడీపీ రూ.14 కోట్లు ఖర్చు పెట్టినా, మద్యం ఏరులై పారించినా ప్రజలు మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగేందుకు వైఎస్సార్ సీపీని గెలిపించారన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించే సత్తా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికే ఉందన్నారు. రానున్న మరో 18 స్థానాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయ శంఖారావం పూరించనుందన్నారు. వైఎస్సార్ అందించిన స్వర్ణయుగ పాలన రానుందని నల్లపరెడ్డి తెలిపారు.
ఓటుకు రూ. 500 నుంచి రూ.800 ఓ పార్టీ, మరో పార్టీ రూ.1,000 నుంచి రూ.1,500 ఖర్చు పెట్టినా ప్రజలు తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీ రూ.20 కోట్లు, టీడీపీ రూ.14 కోట్లు ఖర్చు పెట్టినా, మద్యం ఏరులై పారించినా ప్రజలు మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగేందుకు వైఎస్సార్ సీపీని గెలిపించారన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించే సత్తా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికే ఉందన్నారు. రానున్న మరో 18 స్థానాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయ శంఖారావం పూరించనుందన్నారు. వైఎస్సార్ అందించిన స్వర్ణయుగ పాలన రానుందని నల్లపరెడ్డి తెలిపారు.
0 comments:
Post a Comment