హైదరాబాద్, న్యూస్లైన్: కోవూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డికి మద్దతుగా పార్టీ అనుబంధ దళిత విభాగం ఆధ్వర్యంలో ‘దళిత చైతన్య రథయాత్ర’ పేరిట బుధవారం నుంచి ప్రచారం చేపట్టనున్నట్లు ఆ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్రావు తెలిపారు. ప్రచారానికి సంబంధించిన కరపత్రాలను పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావుతో కలిసి మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... దళితులను కాంగ్రెస్ దగా చేస్తోందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తూ దళితులకు ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. కోవూరు ఉప ఎన్నికల్లో దళితులు తమ సత్తా చూపించి కాంగ్రెస్ను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. దళిత చైతన్య రథయాత్రలో తనతోపాటు కేంద్ర పాలకమండలి సభ్యులు జూపూడి ప్రభాకరరావు, మూలింటి మారెప్పలతోపాటు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి పాల్గొననున్నట్లు సూర్యప్రకాష్రావు తెలిపారు.
Home »
» కోవూరులో దళిత చైతన్యయాత్ర
కోవూరులో దళిత చైతన్యయాత్ర
Written By ysrcongress on Wednesday, March 7, 2012 | 3/07/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment