అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై అసెంబ్లీని రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి ఆరోపించారు. సమావేశాలకు ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారమే అసెంబ్లీని ముగించారని ఆమె అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా అసెంబ్లీని ముగించిన ఘనత కాంగ్రెస్, టీడీపీలకే దక్కుతుందని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ను ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు.
ఒకరికొకకు చెక్ పెట్టుకుందామా అనే ఆలోచన తప్ప.. పీసీసీ అధ్యక్షుడు బొత్స, ముఖ్యమంత్రి కిరణ్లకు ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. ఇప్పటికైనా మేల్కొని ప్రజ సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. చంద్రబాబు పన్నిన కుట్రలో ఆయనే ఇరుక్కున్నారన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెడుతామని శోభానాగిరెడ్డి అన్నారు.
ఒకరికొకకు చెక్ పెట్టుకుందామా అనే ఆలోచన తప్ప.. పీసీసీ అధ్యక్షుడు బొత్స, ముఖ్యమంత్రి కిరణ్లకు ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. ఇప్పటికైనా మేల్కొని ప్రజ సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. చంద్రబాబు పన్నిన కుట్రలో ఆయనే ఇరుక్కున్నారన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెడుతామని శోభానాగిరెడ్డి అన్నారు.
0 comments:
Post a Comment