‘సాక్షి’కి న్యూస్ టెలివిజన్ అవార్డుల పంట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘సాక్షి’కి న్యూస్ టెలివిజన్ అవార్డుల పంట

‘సాక్షి’కి న్యూస్ టెలివిజన్ అవార్డుల పంట

Written By news on Wednesday, March 28, 2012 | 3/28/2012

అనతికాలంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ‘సాక్షి’ వార్తాచానల్‌కు న్యూస్ టెలివిజన్ అవార్డుల పంట పండింది. పలు విభాగాల్లో ‘సాక్షి’ అవార్డులు దక్కించుకుంది. ‘సాక్షి’లో ప్రసారమవుతున్న పొలిటికల్ సెటైర్ షో ‘డింగ్‌డాంగ్’ జాతీయ ఉత్తమ వినోద వార్తా కార్యక్రమ పురస్కారానికి ఎంపికయింది. బెస్ట్ పరిశోధనాత్మక ఫీచర్‌గా ‘వేద ఘోష’, బిజినెస్ ఫీచర్‌గా ‘రూపాయీ’ అవార్డులు దక్కించుకున్నాయి. 2011 బడ్జెట్‌పై ‘సాక్షి’ ప్రసారం చేసిన కార్యక్రమం ఉత్తమ బిజినెస్ టాక్ షోగా పురస్కారం గెల్చుకుంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ‘సాక్షి’ టీవీ మార్కెటింగ్ డెరైక్టర్ రాణిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ యాదవ్ ఈ అవార్డులు అందుకున్నారు.
Share this article :

0 comments: