చావుకు ఖరీదు కట్టే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోడ్డు వంతెనలపై భద్రత కరువైందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి విషయంలో పట్టింపేలేదన్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు జిల్లాలో ప్రమాదాలు జరిగిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వంతెనలు దారుణమైన స్థితిలో ఉన్నాయని.. అటువంటి వంతెనలకు వెంటనే మరమత్తులు చేపట్టాలని జగన్ అన్నారు.
రాష్ట్రంలోని అన్ని పాఠశాల బస్సుల్ని ఆర్టీసీ పరిధిలోకి తీసుకు రావాలని జగన్ సూచించారు. పాఠశాల బస్సుల్ని ఆర్టీసీ అధ్వర్యంలోనే నడిపించాలని.. పాఠశాల యాజమాన్యాలు ఆర్టీసికి రుసుము చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. పాఠశాల బస్సులన్ని ఆర్టీసీ ఆధీనంలోకి వస్తే తప్ప విద్యార్థులకు, తల్లితండ్రులకు, పాఠశాల యాజమాన్యాలకు భద్రత ఉంటుందన్నారు.
రాష్ట్రంలోని అన్ని పాఠశాల బస్సుల్ని ఆర్టీసీ పరిధిలోకి తీసుకు రావాలని జగన్ సూచించారు. పాఠశాల బస్సుల్ని ఆర్టీసీ అధ్వర్యంలోనే నడిపించాలని.. పాఠశాల యాజమాన్యాలు ఆర్టీసికి రుసుము చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. పాఠశాల బస్సులన్ని ఆర్టీసీ ఆధీనంలోకి వస్తే తప్ప విద్యార్థులకు, తల్లితండ్రులకు, పాఠశాల యాజమాన్యాలకు భద్రత ఉంటుందన్నారు.
0 comments:
Post a Comment