ఇందుకూరుపేట జనసంద్రమైంది. కోవూరు ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనం నీరాజనాలు పలికారు. కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. అశేష జన సందోహం మధ్య కాన్వాయ్ ముందుకు కదలటం కూడా కష్టంగా మారింది. మంగళవారం ఉదయం జగదేపేట నుంచి మొదలైన రోడ్ షో ... దేవీస్ పేట, కొత్తూరు, ఇందుకూరుపేట మీదగా సాగింది. ఇందుకూరుపేటలో ప్రజలు వెల్లువలా తరలి వచ్చారు.
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం రెండోరోజు కొనసాగుతోంది. ఇందుకూరు పేట, కొత్తూరులో జనాభిమానం పొటెత్తింది. జగన్ రోడ్ షోకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. కాగా మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. సాక్షి, జీ 24 గంటలు, ఎన్టీవీ ఛానల్స్ ఓబీ వ్యాన్ లను పోలీసులు అడ్డుకున్నారు.
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం రెండోరోజు కొనసాగుతోంది. ఇందుకూరు పేట, కొత్తూరులో జనాభిమానం పొటెత్తింది. జగన్ రోడ్ షోకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. కాగా మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. సాక్షి, జీ 24 గంటలు, ఎన్టీవీ ఛానల్స్ ఓబీ వ్యాన్ లను పోలీసులు అడ్డుకున్నారు.
0 comments:
Post a Comment