టిక్కెట్లు అమ్ముకున్న ఘనత చిరంజీవిదే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టిక్కెట్లు అమ్ముకున్న ఘనత చిరంజీవిదే

టిక్కెట్లు అమ్ముకున్న ఘనత చిరంజీవిదే

Written By news on Wednesday, March 14, 2012 | 3/14/2012

ప్రజారాజ్యం టిక్కెట్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకున్న ఘనత చిరంజీవికే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి దిష్టిబొమ్మను వైఎస్సార్ పార్టీ నేతలు మంగళవారం సాయంత్రం ఏడురోడ్ల కూడలి వద్ద దహనం చేశారు. ఈసందర్భంగా ఆ పార్టీ ప్రతినిధులు హనుమంతు కిరణ్, అందవరపు సూరిబాబు, మార్పు ధర్మారావులు మాట్లాడుతూ అవినీతి కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి పీఆర్పీనే విలీనం చేయడమే కాకుండా పార్టీ టిక్కెట్లును సినిమా టిక్కెట్లు వలే అమ్ముకున్నారని ఆరోపించారు. కొవ్వురు ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని.... నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ 30వేలు మెజార్టీతో గెలుపొందుతారని జోస్యం చెప్నారు.

అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందితే రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల ప్రచారహోరులో జగన్‌పై తప్పుడు మాట్లాడేటప్పుడు ఒక్కసారి చిరంజీవి తన చరిత్రను గుర్తుచేసుకోవాలన్నారు. పార్టీ టిక్కెట్లు అమ్ముకున్న చిరంజీవి జగన్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. అనంతరం ఏడురోడ్ల జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి వైఎస్సార్ పార్టీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈకార్యక్రమంలో ఆ పార్టీ నేతలు రౌతు సీతారామ స్వామి, దుప్పల రవీంద్ర, రాకోటి చిన్నికృష్ణ, రాజశేఖర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గోన్నారు. 
Share this article :

0 comments: