వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై చేయి వేస్తే కోటి చేతులు సమాధానం చెబుతాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ని అరెస్ట్ చేస్తారని వచ్చిన వార్తలు అవాస్తవం అన్నారు. జగన్ ని అరెస్ట్ చేస్తున్నారని ఒక ఛానెల్ అత్యుత్సాహం ప్రదర్శించిందన్నారు. మరికొన్ని ఛానెళ్లు దాన్ని అనుసరించాయని చెప్పారు. కావాలనే కొందరు కాంగ్రెస్ నేతలు కూడా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆధారాలు లేకుండా రాజకీయ కక్షసాధింపుకు పాల్పడితే జనం చూస్తూ ఊరుకోరని, తగినబుద్ది చెబుతారని హెచ్చరించారు. జగన్ పై కుట్ర అంటే తెలుగు జాతిపై కుట్రే అన్నారు.
పదవుల కోసం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నానా తంటాలు పడుతున్నారని అన్నారు. జగన్ పర్యటన రద్దుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయని, రేపటి నుంచి ఆయన పర్యటన యథాతథంగా ఉంటుందని చెప్పారు.
పదవుల కోసం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నానా తంటాలు పడుతున్నారని అన్నారు. జగన్ పర్యటన రద్దుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయని, రేపటి నుంచి ఆయన పర్యటన యథాతథంగా ఉంటుందని చెప్పారు.
0 comments:
Post a Comment