అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. రెండెకరాల బాబుకు హెరిటేజ్ పెట్టడానికి డ బ్బులెక్కడ నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన కుటుంబ ఆస్తులపై సీబీఐ దర్యాప్తు చేయించుకుని తన సచ్ఛీలత నిరూపించుకోవాలని సవాల్ చేశారు. చంద్రబాబులా నీచ రాజకీయాలు చేయడం తన చేతకాదన్నారు. చీకట్లో చిదంబరాన్ని కలవడం బాబుకే చెల్లిందన్నారు. నీతులు వల్లిస్తున్న చంద్రబాబు కోవూరు ఉప ఎన్నికలో ఓటు రూ. 500 చొప్పున పంచలేదా అంటూ నిలదీశారు.
ఓదార్పుయాత్రలో భాగంగా గుంటూరులోని స్తంభాల గరువు సెంటర్లో గురువారం రాత్రి జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. సోనియా గాంధీ ముందు తలవంచనందుకే తన వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు. మాట తప్పే అలవాటు తనకు లేదని మరోసారి స్పష్టం చేశారు. దివంగత మహానేత వైఎస్సార్ తర్వాత రాష్ర్టంలో పజల గురించి ఆలోచించేనాయకుడే కరువయ్యాడని అన్నారు. పేదవాడి గుండెల్లో బతికివుండాలన్న తపనఏ ఒక్క నేతకు లేదని పేర్కొన్నారు. తనపై ప్రేమాభిమానులు చూపుతున్న వారందరికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఓదార్పుయాత్రలో భాగంగా గుంటూరులోని స్తంభాల గరువు సెంటర్లో గురువారం రాత్రి జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. సోనియా గాంధీ ముందు తలవంచనందుకే తన వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు. మాట తప్పే అలవాటు తనకు లేదని మరోసారి స్పష్టం చేశారు. దివంగత మహానేత వైఎస్సార్ తర్వాత రాష్ర్టంలో పజల గురించి ఆలోచించేనాయకుడే కరువయ్యాడని అన్నారు. పేదవాడి గుండెల్లో బతికివుండాలన్న తపనఏ ఒక్క నేతకు లేదని పేర్కొన్నారు. తనపై ప్రేమాభిమానులు చూపుతున్న వారందరికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
0 comments:
Post a Comment