వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం కొత్తపల్లెలో అగ్నిప్రమాద బాధితుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్బాబు, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్రెడ్డి పరామర్శించారు. కడప మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ బాధిత కుటుంబాలను ఫోన్లో పరామర్శించారు. ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. గ్రామానికి చెందిన గురివిరెడ్డిగారి చంద్రకాంతమ్మ వంటచేసే సమయంలో ఇంటి పైకప్పు అంటుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఊరంతా బూడిదగా మారింది. 50 కుటుంబాలు కట్టుబట్టలతో వీధిన పడ్డాయి. తిండివస్తువులు, దుస్తులు, నగదు, బంగారంతో పాటు సర్వస్వం కోల్పొయారు. దాదాపు 80లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆస్తినష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.
Home »
» బాధితులకు వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
బాధితులకు వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
Written By ysrcongress on Sunday, March 4, 2012 | 3/04/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment