ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామోజీ బహిర్గతంగా వచ్చి ఒక పార్టీకి ఓటేయమని అని చెప్పాలి. లేదా ఒక పార్టీ పెట్టుకోవాలి కాని జగన్ గురించి అసత్య ప్రచారాలు చేయొద్దని ఆమె హెచ్చరించింది. జగన్ బ్యానర్ ఐటమ్ లేకుంటే ఈనాడు పేపర్ సేల్ కాదన్నట్టుగా జగన్ గురించి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని శోభానాగిరెడ్డి మండిపడ్డారు.
రామోజి వంద రూపాయల షేర్లను 5వేలకు అమ్మినప్పుడు లేనిది జగన్ షేర్ల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు సాక్షి పేపర్ ,టివీ చూడొద్దని ప్రకటనలు చేస్తున్నారన్నారు. కోవూరు ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతైనా ఈ దుష్పచారాలకు తెరపడుతుందన్నారు. లేదంటే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని శోభానాగిరెడ్డి అన్నారు.
రామోజి వంద రూపాయల షేర్లను 5వేలకు అమ్మినప్పుడు లేనిది జగన్ షేర్ల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు సాక్షి పేపర్ ,టివీ చూడొద్దని ప్రకటనలు చేస్తున్నారన్నారు. కోవూరు ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతైనా ఈ దుష్పచారాలకు తెరపడుతుందన్నారు. లేదంటే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని శోభానాగిరెడ్డి అన్నారు.
0 comments:
Post a Comment