వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయనను అరెస్ట్ చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. వారికేమీ లభ్యం కాలేదు. ఎందుకంటే, దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. అందుకే వారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అయినా కాంగ్రెస్, టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు ‘ఆధారాలు లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని సీబీఐ తాకితే... ఆయనపై ఒక్క చేయి పడినా రాష్ట్రంలోని లక్షల, కోట్ల చేతులు సమాధానం చెబుతాయి...’ అని గట్టిగా హెచ్చరించారు.
జగన్ను అరెస్టు చేస్తారంటూ శనివారం అర్థరాత్రి నుంచీ ఓ వర్గం మీడియా, టీడీపీ, కాంగ్రెస్ వర్గాలు చేసిన దుష్ర్పచారంపై రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ కోవూరు ఎన్నికల ప్రచారం ఒక రోజు మాత్రమే కుటుంబ కారణాల వల్ల వాయిదా పడిందనీ సోమవారం నుంచి మూడు రోజుల పాటు యథావిధిగా ఆయన నెల్లూరు జిల్లాకు వెళ్లి ప్రచార సభల్లో పాల్గొంటారనీ స్పష్టం చేశారు. ‘జగన్ దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.విజయమ్మల ఏకైక పుత్రుడే కాదు...ఈ రాష్ట్రంలోని ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆయనను తమ కుమారుడుగా భావిస్తున్నారు...ప్రతి చెల్లి, ప్రతి అక్క జగన్ను ఒక సోదరుడుగా భావిస్తోంది...ప్రతి అవ్వ, ప్రతి తాత జగన్ను తమ మనవడిగా చూసుకుంటున్నారు...సీబీఐకి ఇదే హెచ్చరిక చేస్తున్నాను....సీబీఐ...! జగన్పై ఒక్క చెయ్యి వేస్తే కోట్లాది చేతులు లేస్తాయి...’ అని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు.
ఏ ఆధారాలు లేక పోయినా కాంగ్రెస్, టీడీపీ నాయకులు చెబుతున్నట్లుగా ఆయనను అరెస్టు చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో...చూస్తారు’ అని అంబటి అల్టిమేటమ్ జారీ చేశారు. జగన్నూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బహిరంగంగా ఎదుర్కోలేక అరెస్టు చేస్తారనే ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్పై చేయి పడితే అది ఆయనపై కాదు, తెలుగు గడ్డపై పడిన చేయిగా ప్రజలు భావిస్తారని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల ప్రచారం ఒక రోజు వాయిదా పడటంపై అంబటి వివరణ ఇస్తూ, ‘తూర్పు గోదావరి జిల్లాలో పల్లం అగ్ని ప్రమాదం భాధితులను పరామర్శించిన దరిమిలా ఈ నెల 2వ తేదీన జగన్ హైదరాబాద్కు చేరుకున్నారు. 3వ తేదీన తన కుటుంబంతో గడిపి, 4 నుంచి కోవూరు ప్రచారంలో పాల్గొనాలనుకున్నారు. అయితే అదే రోజు రాత్రి, రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి 24 గంటల ముందుగా, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ హడావుడిగా 16 మంది వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో పాటుగా మరో పీఆర్పీ ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదించారు. దాంతో 3వతేదీన ఆయన వారితో సమావేశం కావాల్సి వచ్చింది. అందువల్ల ఆరోజు కుటుంబంతో గడపలేక పోయారు.
జగన్కు కూడా ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఒకరికి 12, మరొకరికి పదేళ్లు...వారితో గడిపేందుకు వీలుగా ఆదివారం పర్యటనను రద్దు చేసుకుని ఆ మరుసటి రోజు నుంచీ 5, 6, 7 తేదీల్లో ప్రచారం చేయాలని భావించారు. అంతే తప్ప వాయిదాకు మరో కారణం లేదు. కానీ ఓ టీవీ చానెల్ పనిగట్టుకుని జగన్ను అరెస్టు చేస్తారని ప్రచారం చేసింది. ఆ చానెల్ ఏదో... ఎందుకు ఇలా ప్రచారం చేసిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోటీలో తాము ఎక్కడ వెనుకబడి పోతామోనని మిగతా చానెళ్లు కూడా ఇదే వార్తను ప్రచారం చేశాయి. వాటిని నేను తప్పు పట్టను’ అని అంబటి వివరణ ఇచ్చారు. ఇలాంటి ప్రచారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దనీ చానెళ్లు ప్రచారం చేస్తున్నట్లుగా ఏమీ జరుగదనీ ఆయన భరోసా ఇచ్చారు. కోవూరు పర్యటన కూడా సీబీఐ ఆగమంటే విచారణ కోసం ఆగింది కాదని కూడా ఆయన అన్నారు.
పథకం ప్రకారమే...
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాదరణను దెబ్బ తీయడానికి ఓ పథకం ప్రకారమే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వ్యవహరిస్తున్నాయనీ, ఓ వర్గం మీడియా కూడా ఇలాగే చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 5వ తేదీన వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు అవిశ్వాసతీర్మానానికి మద్దతుగా ఓటేస్తే మూడు నెలల తరువాత వారిపై వేటు వేయడం, అదీ రాజ్యసభ నోటిఫికేషన్ వెలువడటానికి సరిగ్గా ఒక రోజు ముందు జరుగడం ఆ మరుసటి క్షణం నుంచే జగన్ను అరెస్టు చేస్తారని పుకార్లు, హడావుడి ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని అంబటి దుయ్యబట్టారు. రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ ఇలాంటి దుష్ర్పచారం చేయడం సరికాదని ఆయన అన్నారు. ధైర్యం ఉంటే కోవూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ను ఎదుర్కోవాలని ఆయన అన్నారు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో ఈ నెల 21వ తేదీన తేలుతుందని ఆయన స్పష్టం చేస్తూ ఇలాంటి ప్రచారం చేస్తున్న వారు అనుభవించక తప్పదని ఆయన అన్నారు.
మంత్రులకు సిగ్గూ శరం ఉందా!
వై.ఎస్.రాజశేఖరరెడ్డిని మావాడే అని ఒక వైపు చెబుతూ మరో వైపు ఆయన కుమారుడిని చెడ్డవాడని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెబుతూండటం పట్ల అంబటి తీవ్ర అభ్యంతరం తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాల్లో తమకూ భాధ్యత ఉందని ఓ వైపు బొత్స చెబుతూ బయట జరిగే వాటిని తమకు బాధ్యత లేదనడం సిగ్గు మాలిన చర్య అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండిన వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొన్నపుడు ఆయనతో పాటు పనిచేసిన మంత్రులకు ఇంకా అధికారంలో కొనసాగే నైతిక అర్హత ఉందా? అని అంబటి ప్రశ్నించారు. అసలు ఈ మంత్రులందరికీ సిగ్గూ, శరం ఉందా అని ఆయన నిలదీశారు. వై.ఎస్ జీవించి ఉన్నపుడు బొత్స ఏ విధంగా ఆయన ప్రాపకం కోసం పాకులాడారో అందరికీ గుర్తుందని ఆయన అన్నారు. బొత్స పదవి కోసం నానా గడ్డీ కరిచే రకం అని ఆయన మండి పడ్డారు.
జగన్ను అరెస్టు చేస్తారంటూ శనివారం అర్థరాత్రి నుంచీ ఓ వర్గం మీడియా, టీడీపీ, కాంగ్రెస్ వర్గాలు చేసిన దుష్ర్పచారంపై రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ కోవూరు ఎన్నికల ప్రచారం ఒక రోజు మాత్రమే కుటుంబ కారణాల వల్ల వాయిదా పడిందనీ సోమవారం నుంచి మూడు రోజుల పాటు యథావిధిగా ఆయన నెల్లూరు జిల్లాకు వెళ్లి ప్రచార సభల్లో పాల్గొంటారనీ స్పష్టం చేశారు. ‘జగన్ దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.విజయమ్మల ఏకైక పుత్రుడే కాదు...ఈ రాష్ట్రంలోని ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆయనను తమ కుమారుడుగా భావిస్తున్నారు...ప్రతి చెల్లి, ప్రతి అక్క జగన్ను ఒక సోదరుడుగా భావిస్తోంది...ప్రతి అవ్వ, ప్రతి తాత జగన్ను తమ మనవడిగా చూసుకుంటున్నారు...సీబీఐకి ఇదే హెచ్చరిక చేస్తున్నాను....సీబీఐ...! జగన్పై ఒక్క చెయ్యి వేస్తే కోట్లాది చేతులు లేస్తాయి...’ అని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు.
ఏ ఆధారాలు లేక పోయినా కాంగ్రెస్, టీడీపీ నాయకులు చెబుతున్నట్లుగా ఆయనను అరెస్టు చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో...చూస్తారు’ అని అంబటి అల్టిమేటమ్ జారీ చేశారు. జగన్నూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బహిరంగంగా ఎదుర్కోలేక అరెస్టు చేస్తారనే ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్పై చేయి పడితే అది ఆయనపై కాదు, తెలుగు గడ్డపై పడిన చేయిగా ప్రజలు భావిస్తారని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల ప్రచారం ఒక రోజు వాయిదా పడటంపై అంబటి వివరణ ఇస్తూ, ‘తూర్పు గోదావరి జిల్లాలో పల్లం అగ్ని ప్రమాదం భాధితులను పరామర్శించిన దరిమిలా ఈ నెల 2వ తేదీన జగన్ హైదరాబాద్కు చేరుకున్నారు. 3వ తేదీన తన కుటుంబంతో గడిపి, 4 నుంచి కోవూరు ప్రచారంలో పాల్గొనాలనుకున్నారు. అయితే అదే రోజు రాత్రి, రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి 24 గంటల ముందుగా, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ హడావుడిగా 16 మంది వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో పాటుగా మరో పీఆర్పీ ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదించారు. దాంతో 3వతేదీన ఆయన వారితో సమావేశం కావాల్సి వచ్చింది. అందువల్ల ఆరోజు కుటుంబంతో గడపలేక పోయారు.
జగన్కు కూడా ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఒకరికి 12, మరొకరికి పదేళ్లు...వారితో గడిపేందుకు వీలుగా ఆదివారం పర్యటనను రద్దు చేసుకుని ఆ మరుసటి రోజు నుంచీ 5, 6, 7 తేదీల్లో ప్రచారం చేయాలని భావించారు. అంతే తప్ప వాయిదాకు మరో కారణం లేదు. కానీ ఓ టీవీ చానెల్ పనిగట్టుకుని జగన్ను అరెస్టు చేస్తారని ప్రచారం చేసింది. ఆ చానెల్ ఏదో... ఎందుకు ఇలా ప్రచారం చేసిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోటీలో తాము ఎక్కడ వెనుకబడి పోతామోనని మిగతా చానెళ్లు కూడా ఇదే వార్తను ప్రచారం చేశాయి. వాటిని నేను తప్పు పట్టను’ అని అంబటి వివరణ ఇచ్చారు. ఇలాంటి ప్రచారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దనీ చానెళ్లు ప్రచారం చేస్తున్నట్లుగా ఏమీ జరుగదనీ ఆయన భరోసా ఇచ్చారు. కోవూరు పర్యటన కూడా సీబీఐ ఆగమంటే విచారణ కోసం ఆగింది కాదని కూడా ఆయన అన్నారు.
పథకం ప్రకారమే...
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాదరణను దెబ్బ తీయడానికి ఓ పథకం ప్రకారమే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వ్యవహరిస్తున్నాయనీ, ఓ వర్గం మీడియా కూడా ఇలాగే చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 5వ తేదీన వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు అవిశ్వాసతీర్మానానికి మద్దతుగా ఓటేస్తే మూడు నెలల తరువాత వారిపై వేటు వేయడం, అదీ రాజ్యసభ నోటిఫికేషన్ వెలువడటానికి సరిగ్గా ఒక రోజు ముందు జరుగడం ఆ మరుసటి క్షణం నుంచే జగన్ను అరెస్టు చేస్తారని పుకార్లు, హడావుడి ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని అంబటి దుయ్యబట్టారు. రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ ఇలాంటి దుష్ర్పచారం చేయడం సరికాదని ఆయన అన్నారు. ధైర్యం ఉంటే కోవూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ను ఎదుర్కోవాలని ఆయన అన్నారు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో ఈ నెల 21వ తేదీన తేలుతుందని ఆయన స్పష్టం చేస్తూ ఇలాంటి ప్రచారం చేస్తున్న వారు అనుభవించక తప్పదని ఆయన అన్నారు.
మంత్రులకు సిగ్గూ శరం ఉందా!
వై.ఎస్.రాజశేఖరరెడ్డిని మావాడే అని ఒక వైపు చెబుతూ మరో వైపు ఆయన కుమారుడిని చెడ్డవాడని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెబుతూండటం పట్ల అంబటి తీవ్ర అభ్యంతరం తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాల్లో తమకూ భాధ్యత ఉందని ఓ వైపు బొత్స చెబుతూ బయట జరిగే వాటిని తమకు బాధ్యత లేదనడం సిగ్గు మాలిన చర్య అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండిన వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొన్నపుడు ఆయనతో పాటు పనిచేసిన మంత్రులకు ఇంకా అధికారంలో కొనసాగే నైతిక అర్హత ఉందా? అని అంబటి ప్రశ్నించారు. అసలు ఈ మంత్రులందరికీ సిగ్గూ, శరం ఉందా అని ఆయన నిలదీశారు. వై.ఎస్ జీవించి ఉన్నపుడు బొత్స ఏ విధంగా ఆయన ప్రాపకం కోసం పాకులాడారో అందరికీ గుర్తుందని ఆయన అన్నారు. బొత్స పదవి కోసం నానా గడ్డీ కరిచే రకం అని ఆయన మండి పడ్డారు.
0 comments:
Post a Comment