చంద్రబాబు దొంగకోళ్లు పట్టేవాడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు దొంగకోళ్లు పట్టేవాడు

చంద్రబాబు దొంగకోళ్లు పట్టేవాడు

Written By ysrcongress on Tuesday, March 6, 2012 | 3/06/2012


 
విజయమ్మ కాలి గోటికి కూడా సరిపోడు
నేను కాంగ్రెస్, టీడీపీ నుంచి పోటీ చేసి ఉంటే డిపాజిట్ కూడా దక్కేదికాదు
బాబూ నోరు అదుపులో ఉంచుకోకపోతే రాళ్లదెబ్బలు తప్పవు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డి

కోవూరునుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘టీడీపీ అధినేత చంద్రబాబు దొంగ కోళ్లు పట్టేవాడు.. బొల్లిబాబు.. ఉన్మాది.. ఒక రకంగా చెప్పాలంటే బ్రోకర్.. వైఎస్ విజయమ్మ కాలి గోటికి కూడా సరిపోడు. నోరు అదుపులో పెట్టుకోకపోతే రాళ్ల దెబ్బలు తప్పవు.’ అని కోవూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. 

మండల కేంద్రమైన కొడవలూరులో జరిగిన సభలో ప్రసన్నకుమార్‌రెడ్డి ఉద్వేగపూరితంగా మాట్లాడారు, కోవూరుకు ప్రచారానికి వచ్చిన చంద్రబాబు తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మపై నీచస్థాయికి దిగజారి విమర్శలు, ఆరోపణలు గుప్పించారని మండిపడ్డారు. శవాలమీద చిల్లర ఏరుకునే తత్వం కలిగిన చంద్రబాబు విజయమ్మ కాలిగోటికి కూడా సరిపోడని, ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడాలన్నారు. చంద్రబాబు చూపులను చూస్తే చిన్నపిల్లలు భయపడుతున్నారని, ఆయన చూపు, మనసు అంతా ప్రజలను ఎప్పుడెప్పుడు ముంచుదామా అనే విధంగా ఉంటుం దని దుయ్యబట్టారు. ప్రచారానికి వచ్చిన చంద్రబాబు టీడీపీ గురించి జనానికి చెప్పుకొని ఓట్లు అడగాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద మరోసారి దిగజారుడు విమర్శలు చేస్తే ప్రజలే రాళ్లతో కొడతారని హెచ్చరించారు. పదవీ వ్యామోహంతో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది నీవుకాదా అని ప్రశ్నించారు. 

సోనియాగాంధీని ఎదిరించిన ఏకైక నాయకుడు జగ నేనని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు నీరాజనాలు పలుకుతుండడంతో సోనియాగాంధీ, చంద్రబాబులకు నిద్రపట్టడం లేదన్నారు, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా విఫలమైన చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పెల్లుబుకుతున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక దిగజారుడు విమర్శలు చేస్తున్నారన్నారు. తాను కాంగ్రెస్, టీడీపీల నుంచి పోటీ చేసి ఉంటే డిపాజిట్ కూడా దక్కేది కాదన్నారు. టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మూడోస్థానమేనని, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని ఆయన ధీమాగా చెప్పారు. కొడవలూరు మాజీ సర్పంచ్ ఒట్టూరు సునీత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Share this article :

0 comments: