తూర్పుగోదావరి జిల్లాలోఉప ఎన్నిక జరగనున్న రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏప్రిల్ మొదటి వారంలో పర్యటించనున్నట్టు పార్టీ కార్యనిర్వాహక మండలి(సీఈసీ) సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. కాజులూరు మండలంలోని నామవానిపాలెంలో ఈ రోజు ‘గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పోలవరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్నారు. అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లా చేరుకుని 5, 6, 7 తేదీల్లో రామచంద్రపురం నియోజకవర్గంలోని రామచంద్రపురం, కె. గంగవరం, కాజులూరు మండల గ్రామాల్లో రోడ్డు షోలను నిర్వహిస్తారని తెలిపారు.
Home »
» వచ్చేనెలలో జగన్ రామచంద్రాపురం పర్యటన
వచ్చేనెలలో జగన్ రామచంద్రాపురం పర్యటన
Written By news on Monday, March 19, 2012 | 3/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment