సీమాంధ్ర ప్రాంతంలో జరిగే ఉపఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ప్రభంజనాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్రెడ్డి అన్నారు. రాయికల్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలపై రాజ్యసభ ఎన్నికల ప్రకటనకు ముందే అనర్హత వేటు వేశారని చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి ప్రకటిస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలుంటాయన్నారు. 2006, 2008లలో కరీంనగర్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యం తగ్గి, కాంగ్రెస్ బలం పెరిగిందని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరమన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమిపాలవుతామని సీఎం ముందే అంచనాకు వచ్చినట్లు ఆయన మాటల్లోనే వెల్లడవుతోందని చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి ప్రకటిస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలుంటాయన్నారు. 2006, 2008లలో కరీంనగర్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యం తగ్గి, కాంగ్రెస్ బలం పెరిగిందని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరమన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమిపాలవుతామని సీఎం ముందే అంచనాకు వచ్చినట్లు ఆయన మాటల్లోనే వెల్లడవుతోందని చెప్పారు.
0 comments:
Post a Comment