వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ కు సంబంధించి ఆరు జిల్లాల కన్వీనర్లను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు బిసి సెల్ రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా కన్వీనర్ గా అవ్వూరు జానకి రామయ్య, తూర్పు గోదావరి జిల్లాకు జి.రమణ, ప్రకాశం జిల్లాకు కటారి శంకర్, హైదరాబాద్ నగరానికి ఎస్.శ్రీనివాస్, మహబూబ్ నగర్ జిల్లాకు టి.వేణుగోపాల్, ఖమ్మం జిల్లాకు తోట రామారావుని నియమించినట్లు ఆయన వివరించారు.
Home »
» వైఎస్ఆర్ కాంగ్రెస్ బిసి సెల్ కన్వీనర్ల నియామకం
వైఎస్ఆర్ కాంగ్రెస్ బిసి సెల్ కన్వీనర్ల నియామకం
Written By news on Monday, March 12, 2012 | 3/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment