రాజకీయాల్లో ఉన్నన్నాళ్లు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపిన మార్గంలో నడుస్తూ విలువలు, విశ్వసనీయతను ఇక ముందు కూడా కొనసాగిస్తామని వైఎస్ అభిమాన మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి చెప్పారు. తామంతా ఏ కారణం చేతనైతే అనర్హతకు గురయ్యామో ప్రజలకు వివరిస్తామన్నారు. రైతులు, రైతుకూలీల కోసం కొందరు తలపాగా చుట్టుకొని పోరుయాత్రలంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కానీ తాము తమ పదవులను అన్నదాత కోసం తృణప్రాయంగా వదులుకున్నామని చెప్పారు.
ప్రభుత్వం పడిపోదని నిర్దారించుకున్నాకే చంద్రబాబు అవిశ్వాసమంటూ దొంగ నాటకం ఆడారని విమర్శించారు. ఆ విషయం తెలిసినప్పటికీ రైతు పక్షాన నిలిచినందుకు తమకు చాలా గర్వంగా ఉందన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించి ఉంటే ప్రజలపై భారం కాస్త త గ్గేదన్నారు. తమను అప్పుడే అనర్హులుగా ప్రకటించి ఉంటే, ప్రస్తుత ఏడు స్థానాలలో జరిగే ఉప ఎన్నికలతో పాటు ఈ స్థానాలకు జరిగేవని వివరించారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నందున తమపై ఇంతకాలం చర్యలు తీసుకోకుండా తాత్సర్యం చేశారన్నారు. తామంతా రైతుల కోసం నిలబడినందున ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు తమని తప్పకుండా ఆశీర్వదిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు
ప్రభుత్వం పడిపోదని నిర్దారించుకున్నాకే చంద్రబాబు అవిశ్వాసమంటూ దొంగ నాటకం ఆడారని విమర్శించారు. ఆ విషయం తెలిసినప్పటికీ రైతు పక్షాన నిలిచినందుకు తమకు చాలా గర్వంగా ఉందన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించి ఉంటే ప్రజలపై భారం కాస్త త గ్గేదన్నారు. తమను అప్పుడే అనర్హులుగా ప్రకటించి ఉంటే, ప్రస్తుత ఏడు స్థానాలలో జరిగే ఉప ఎన్నికలతో పాటు ఈ స్థానాలకు జరిగేవని వివరించారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నందున తమపై ఇంతకాలం చర్యలు తీసుకోకుండా తాత్సర్యం చేశారన్నారు. తామంతా రైతుల కోసం నిలబడినందున ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు తమని తప్పకుండా ఆశీర్వదిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు
1 comments:
u r the king of rayachoti
Post a Comment