ఉప ఎన్నికల ఫలితాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా ఉండాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. రైతులు, రైతు కూలీలకు అండగా అవిశ్వాసానికి ఓటేసిందుకు వచ్చిన ఉప ఎన్నికలు విలువలు, విశ్వసనీయతకు అద్దం పట్టాలన్నారు.
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మంత్రులు మోహరిస్తారని అనురాగం, ఆత్మీయతలను కొనడానికి చూస్తారని జగన్ అన్నారు. ప్రలోభాలకు లోనవకుండా ఢిల్లీ పెద్దల కళ్లు తెరిపించేలా తీర్పు చెప్పాలని జగన్ కోరారు. కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నకుమార్రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మంత్రులు మోహరిస్తారని అనురాగం, ఆత్మీయతలను కొనడానికి చూస్తారని జగన్ అన్నారు. ప్రలోభాలకు లోనవకుండా ఢిల్లీ పెద్దల కళ్లు తెరిపించేలా తీర్పు చెప్పాలని జగన్ కోరారు. కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నకుమార్రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కొవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తరపున వైఎస్ జగన్ తోలిరోజు ప్రచారం కొడవలూరు మండలంలో కొనసాగుతోంది. కొడవలూరులో జగన్కు పెద్ద ఎత్తున ఘనస్వగతం లబించింది. ఈసందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అనంతరం కొడవలూరు,గుండాలపాలెం,బసవాయపాలెం,వెంకన్నపాలెంలో పర్యటించి ప్యాన్ గుర్తుకు ఒటేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
0 comments:
Post a Comment