'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయండి' ఈ మెసేజ్ను మరో 15 మందికి పంపితే మీ సెల్ఫోన్కి 500 రూపాయలు బ్యాలెన్స్ వస్తుందంటూ పంపుతున్న ఎస్ఎంఎస్లపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఎస్ఎంఎస్లతో పార్టీకి గానీ, కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎలాంటి సంబందం లేదని ఆ పార్టీ కన్వీనర్ పిఎన్ వి ప్రసాద్ ప్రకటించారు. ఈ ఎస్ఎంఎస్ వెనుక టీడీపీ కుట్ర ఉందన్నారు. అంతేకాక ఈ ఎస్ఎంఎస్లో మరిన్ని వివరాలకు సాక్షి టీవీ చూడాలంటూ తప్పుడు సమాచారాన్ని కూడా అందరికి ఎస్ఎంఎస్లు పంపుతున్నారన్నారని ఆయన తెలిపారు. దీనిపై వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
Home »
» 'ఎస్ ఎంఎస్ లతో వైఎస్ఆర్ సిపికి సంబంధంలేదు'
'ఎస్ ఎంఎస్ లతో వైఎస్ఆర్ సిపికి సంబంధంలేదు'
Written By ysrcongress on Wednesday, March 7, 2012 | 3/07/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment