కోవూరు నియోజకవర్గంలో జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ఒక్కరోజు వాయిదా వేసుకోవటంపై ఎల్లోమీడియా చేస్తున్న ప్రచారం దుర్మార్గమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. కనీస నైతిక విలువలు కూడా లేని ఎల్లో మీడియా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా కోటి కుట్రలు పన్నటం అసహ్యంగా ఉందని ఆపార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటై జగన్ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఇలా చౌకబారు ఆరోపణలు ఎల్లో మీడియాతో చేయిస్తున్నారన్నారు. అధికార పార్టీ నేతలకు వత్తాసు పలకటమే తన పనిగా సీబిఐ వ్యవహరించటం దారుణమన్నారు. రేపట్నుంచి జగన్ యాథాతథంగా కోవూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కోటంరెడ్డి చెప్పారు.
Home »
» ఎల్లోమీడియా ప్రచారంపై కోటంరెడ్డి ఫైర్
ఎల్లోమీడియా ప్రచారంపై కోటంరెడ్డి ఫైర్
Written By news on Sunday, March 4, 2012 | 3/04/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment