తూర్పు గోదావరి జిల్లా పల్లం అగ్ని ప్రమాద బాధితులకు శాశ్వత ప్రాతిపాదకన సాయమందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధితులను అయిదేళ్లపాటు ఆదుకోవాలని కోరారు. శుక్రవారం జగన్ పల్లంలో ప్రతి ఇంటికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. పల్లంలో పరిస్థితులు చూసి ఆయన చలించిపోయారు. ఈసందర్భంగా గ్రామంలోని మహిళలు, వృద్ధులు జగన్ ముందు తమ బాధలు ఏకరవు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బాధిత కుటుంబాలకు దుస్తులు, వంట పాత్రలు, నిత్యావసర వస్తువులను అందజేశారు. మూడు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో పల్లం మొత్తం తగులబడి పోయింది. దాదాపు 400 గుడిసెలు అగ్నికి ఆహుతి కాగా, 750 కుటుంబాలు వీధిన పడ్డాయి. |
Home »
» వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment