రైల్వే ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ నిరసనలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైల్వే ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ నిరసనలు

రైల్వే ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ నిరసనలు

Written By ysrcongress on Friday, March 16, 2012 | 3/16/2012

పెంచిన రైల్వే ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా నాయకులు ఖమ్మంలో హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైటాయించి రాస్తారోకో చేశారు. అనంతరం యుపిఎ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. 

ఈ సందర్బంగా పార్టీ జిల్లా కన్వీనర్ చందా లింగయ్యదొర మాట్లాడుతూ రైల్వే చార్జీల పెంపు వల్ల సామాన్యుడిపై భారం పడుతోందని, తక్షణం ఈ భారాన్ని తగ్గించేందుకు చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గున్నం నాగిరెడ్డి, తోట రామారావు, సాదు రమేష్ రెడ్డి, ఎండి ముస్తాఫా, జమలాపురం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: