వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సూచన మేరకు రైతులు, రైతు కూలీల పక్షాన నిలిచినందుకు తనకు చాలా తృప్తిగా ఉందని వైఎస్ అభిమాన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. 1994 నుంచి వైఎస్ కుటుంబం ఆశీస్సులతో రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు. ఇక ముందు కూడా ఆ కుటుంబానికి వెన్నంటి ఉంటానన్నారు. కాంగ్రెస్-టీడీపీ చేస్తున్న కుయుక్తులను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో బంఫర్ మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెడతామని ధీమా వ్యక్తం చేశారు.
Home »
» కాంగ్రెస్-టీడీపీ కుయుక్తులను ఎండగడ్తాం: పిన్నెల్లి
కాంగ్రెస్-టీడీపీ కుయుక్తులను ఎండగడ్తాం: పిన్నెల్లి
Written By ysrcongress on Saturday, March 3, 2012 | 3/03/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment