నెల్లూరులో టీడీపీ నేత ఓంప్రకాష్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడిన వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోవూరు ఉప ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోభపెట్టేందుకే పెద్ద మొత్తంలో డబ్బును టీడీపీ నెల్లూరుకు తరలించిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు. ఈసీని కలిసిన వారిలో జనక్ప్రసాద్, పుత్తా ప్రతాప్రెడ్డి, జనార్దనరెడ్డి తదితరులున్నారు.
టీడీపీ నేత ఓంప్రకాష్ యాదవ్ ఇంట్లో రూ. 5 కోట్లు దొరికాయని ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్రెడ్డి ఆరోపించారు. పోలీసులు కోటి రూపాయలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారని ఆయన అన్నారు. కోవూరు ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
టీడీపీ నేత ఓంప్రకాష్ యాదవ్ ఇంట్లో రూ. 5 కోట్లు దొరికాయని ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్రెడ్డి ఆరోపించారు. పోలీసులు కోటి రూపాయలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారని ఆయన అన్నారు. కోవూరు ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment