హైదరాబాద్, న్యూస్లైన్: కోవూరు ఉప ఎన్నికల పర్యటనకు వెళ్లిన తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి జిల్లా పోలీసులు అడ్డంకులు సృష్టించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు శివకుమార్తో కలిసి ఆయన మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అతిగా ప్రవర్తించిన కోవూరు పోలీసులపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అంబటి విలేకరులతో మాట్లాడుతూ కోవూరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్, టీడీపీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాత్రి పదిగంటల తర్వాత వాహనంపై ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రచారం చేసినా పట్టించుకోని పోలీసులు, జగన్ ప్రచారాన్ని అడ్డుకున్నారని చెప్పారు. ఆయనను ప్రచార వాహనం నుంచి కనీసం అభివాదం చేయడానికి కూడా అనుమతించలేదని, కారులో కూడా వెళ్లనీయకుండా ఇబ్బందులు సృష్టించారని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఆ రెండు పార్టీలకు సహకరిస్తూ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని పోలీసులపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
Home »
» బాబును వదిలేశారు..జగన్ను అడ్డుకున్నారు
బాబును వదిలేశారు..జగన్ను అడ్డుకున్నారు
Written By ysrcongress on Wednesday, March 7, 2012 | 3/07/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment