జగన్‌ను కలిసిన 108 ఉద్యోగులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను కలిసిన 108 ఉద్యోగులు

జగన్‌ను కలిసిన 108 ఉద్యోగులు

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012

ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్న తమను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని 108 సేవల ఉద్యోగులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయారు. నరసన్నపేటలో మంగళవారం ఉదయం జననేతను వారు కలిసి సమస్యలను విన్నవించారు. తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం కృషి చేయాలని కోరారు. గతంలో తాము సమ్మె చేసిన సమయంలో తమ డిమాండ్లను పరిష్కరిస్తామని సర్కార్ హామీ ఇచ్చిందని, అయితే ఆ హామీని నేటికీ అమలు చేయలేదని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన స్పందిస్తూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సేవలను ఎలా వినియోగించుకోవాలో చూస్తామని హామీ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.సూర్యనారాయణ, సీఎం రాజశేఖరం, ఆర్.రమేష్‌బాబు, డి.నారాయణరావు, పి.రమణయ్య ఉన్నారు.
Share this article :

0 comments: