13 నుంచి జగన్ రెండో విడత ప్రచార భేరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 13 నుంచి జగన్ రెండో విడత ప్రచార భేరి

13 నుంచి జగన్ రెండో విడత ప్రచార భేరి

Written By news on Wednesday, April 11, 2012 | 4/11/2012

రాష్ట్రంలో ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు త్వరలో జరిగే ఉప ఎన్నికలకు రెండో విడత ప్రచార భేరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 13వ తేదీ నుంచి మోగించనున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. మళ్లీ 13 నుంచి 11 రోజుల పాటు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13, 14, 15 తేదీల్లో నరసన్నపేట (శ్రీకాకుళం), 16, 17 తేదీల్లో పాయకరావుపేట (విశాఖపట్నం), 18, 19, 20, 21 తేదీల్లో పోలవరం, 22, 23 తేదీల్లో నరసాపురం (పశ్చిమ గోదావరి) నియోజకవర్గాల్లో పర్యటిస్తారని వివరించారు.
Share this article :

0 comments: