ఐదు ఉప స్థానాలకు రూ.18.43 కోట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఐదు ఉప స్థానాలకు రూ.18.43 కోట్లు

ఐదు ఉప స్థానాలకు రూ.18.43 కోట్లు

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012

ఉప ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఎం విచక్షణాధికారంతో మంజూరు చేసే ప్రత్యేక నిధి నుంచి రూ.కోట్ల నిధుల పందేరం కొనసాగుతోంది. ఉప ఎన్నికలు జరగనున్న పోలవరం, మాచర్ల, రాయదుర్గం, ప్రత్తిపాడు, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో రూ.18.43 కోట్ల విలువగల పనులు నామినేషన్‌పై ఇచ్చేందుకు వీలుగా సోమ, మంగళవారాల్లో ప్రణాళికా శాఖ జీవోలు జారీ చేసింది. స్థానిక నేతలు చేజారిపోకుండా వారికి నామినేషన్‌పై పనులు అప్పగించేందుకు వీలుగా ఒక్కో పనినీ రూ.ఐదు లక్షలు దాటకుండా విభ జించారు. ఎక్కువగా సీసీ రోడ్లు, బోర్లు, డ్రైనేజీ పనులను ఈ నిధులతో చేపట్టనున్నారు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లేకుండానే ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు సీఎం ప్రత్యేక నిధి నుంచి పనులు మంజూరు కొనసాగడం విశేషం. 

ఈ ప్రత్యేక నిధికి బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వలేదు. ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ పనులకు శంకుస్థాపనలు చేయడం ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని సర్కారు ఎత్తుగడ వేసింది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లేకపోయినా హడావుడిగా పనులు మంజూరు చేస్తూ ప్రణాళికా శాఖ ద్వారా జీవోలు జారీ చేయిస్తున్నారని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో పనులు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవోలతో కలిపి ఇప్పటివరకు ఉప స్థానాలకు రూ.58.15 కోట్ల విలువగల పనులు నామినేషన్‌పై ఇచ్చినట్లైంది.
Share this article :

0 comments: