కాకినాడ, ఏప్రిల్ 20: ‘కెఎస్ఇజడ్ ఏర్పాటుకు ముందుగా ప్రతిపాదనలు తీసుకొచ్చింది మీరే కదా’ అంటూ టిడిపి అధినేత చంద్రబాబును సెజ్ ప్రాంతానికి చెందిన కొందరు నిలదీశారు. కెఎస్ఇజడ్ ప్రాంతంలో శుక్రవారం రైతులకు మద్దతుగా పర్యటించిన టిడిపి అధినేత చంద్రబాబు స్థానికుల నుంచి వచ్చిన ఈ ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేశారు. యు కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం సెజ్ బాధిత రైతులు నిర్వహించిన ఏరువాక కార్యక్రమానికి బాబు హాజరయ్యారు. ఈ సమయంలో కొందరు స్థానికులు మాట్లాడుతూ ‘2002లో మీరే కదా ఎస్ఇజడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తీసుకొచ్చారు?’ అంటూ నిలదీశారు. ఈ మాటలు వినగానే చంద్రబాబు వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు. వేళాకోళంగా ఉందా?’ అంటూ గద్దించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దని వారించారు. అంతకుముందు కాకినాడలో జరిగిన సదస్సులో తనపై ఒక పత్రిక, ఒక ఛానల్ పనిగట్టుకుని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. సెజ్కు తానే నాంది పలికానంటూ అర్ధంపర్ధంలేని అసత్య కథనాలను ఆ మీడియా సంస్థ ప్రచారం చేస్తోందని, దొంగే దొంగ దొంగ అన్న చందాన సదరు
నాయకుడు ప్రవర్తిస్తున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నావెంట ఉంటే మీ భూములు మీకే సొంతం
‘నావెంట మీరుంటే మీ వెనుక నేనుండి పోరాటం సాగించి మీ భూములు తిరిగి మీకు సొంతమయ్యేలా కృషి చేస్తాను’ అని చంద్రబాబు కాకినాడ ఎస్ఇజడ్ బాధిత రైతులకు, నిర్వాసితులకు భరోసా ఇచ్చారు.
నాయకుడు ప్రవర్తిస్తున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నావెంట ఉంటే మీ భూములు మీకే సొంతం
‘నావెంట మీరుంటే మీ వెనుక నేనుండి పోరాటం సాగించి మీ భూములు తిరిగి మీకు సొంతమయ్యేలా కృషి చేస్తాను’ అని చంద్రబాబు కాకినాడ ఎస్ఇజడ్ బాధిత రైతులకు, నిర్వాసితులకు భరోసా ఇచ్చారు.
0 comments:
Post a Comment