వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రెండవ రోజైన శుక్రవారం జరిపే పర్యటన వివరాలను పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ ఒక ప్రకటనలో తెలిపారు.
* జగన్ ఉదయం కె.గంగవరంలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
* అనంతరం కూనిమిల్లిపాడు, యర్రపోతవరం, బాలాంత్రంలలో దివంగత మహానేత వైఎస్ విగ్రహాల్ని ఆవిష్కరిస్తారు.
* తర్వాత పేకేరు, తాళ్లపూడి, భట్లపాలికలలో పర్యటిస్తారు.
* అనంతరం మసకపల్లి, కోలంకల్లో వైఎస్ విగ్రహాల్ని ఆవిష్కరిస్తారు.
* కుయ్యేరు, దుగ్గుదూరు, కాజులూరు, చేదువాడ గొల్లపాలెంలో పర్యటించిన అనంతరం కాకినాడ-కోటిపల్లి రోడ్లో ఆర్యవటం మీదుగా ఉండూరు చేరుకోవడంతో రెండవ రోజు పర్యటన ముగుస్తుంది.
* రాత్రికి హసన్బాదలోని మాజీ మంత్రి, పార్టీ సీఈసీ సభ్యులు పిల్లి సుభాష్చంద్రబోస్ ఇంట్లో బస చేస్తారు.
0 comments:
Post a Comment