నరసన్నపేటకు కదిలివచ్చిన జనసమూహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నరసన్నపేటకు కదిలివచ్చిన జనసమూహం

నరసన్నపేటకు కదిలివచ్చిన జనసమూహం

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012


నరసన్నపేట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రాక సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జనంతో నిండిపోయింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాత్రి 7 గంటలకు ఇక్కడకు వచ్చిన జగన్ కు ఘనస్వాగతం లభించింది. అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఎటు చూసినా జనమే జనం. వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. నేల ఈనిందా అన్నట్లు ఉంది నరసన్నపేట. జగన్ ని చూసేందుకు జనం మేడలు, మిద్దెలు, చివరకు గోడలు కూడా ఎక్కారు. జగన్ వెంట అభ్యర్థి ధర్మాన కృష్ణ దాస్ ఉన్నారు.
ఇదిలా ఉండగా, జగన్ పర్యటనకు, బహిరంగ సభకు ఆటంకం కలిగించడానికి విద్యుత్ అధికారులు 2 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయినా జనం జగన్ ని చూసేందుకు అక్కడే వేచి ఉన్నారు.
Share this article :

0 comments: