నగరానికి చేరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి ఏలూరు రోడ్డులో ఘనస్వాగతం లభించింది. జగన్ రాక సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో జగన్ కు అపూర్వ స్వాగతం పలికారు. భారీగా బాణాసంచా కాల్చారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఈరోజు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందున జనం భారీ సంఖ్యలో కదలివచ్చారు. భారీ ఎత్తున బైకు ర్యాలీ నిర్వహించారు. విజయవాడ రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి. జై జగన్ అన్న నినాదాలతో హొరెత్తింది. నగరంలో పండుగ వాతావరణం నెలకొంది.
బిసెంట్ రోడ్డులోని దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. రాధా మెడలో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
బిసెంట్ రోడ్డులోని దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. రాధా మెడలో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
0 comments:
Post a Comment