కాంట్రాక్టు కోసం సోనియా బంధువు ఒత్తిడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంట్రాక్టు కోసం సోనియా బంధువు ఒత్తిడి

కాంట్రాక్టు కోసం సోనియా బంధువు ఒత్తిడి

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012

కాంట్రాక్టు కోసం సోనియా బంధువు ఒత్తిడి
సోనియా చెల్లెలి మాజీ భర్త విన్సీయే బ్లాక్‌మెయిలర్
బోఫోర్స్ బాగోతమంతా అతనికి తెలుసు 
ఆ కుంభకోణంలో ఖత్రోచీ, అతను తోడుదొంగలు
రాజీవ్, సోనియా పాత్రనూ బయటపెడతానంటున్నాడు
విన్సీ తరచుగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి పోతున్నాడు 
రాష్ట్రంలో మైనింగ్ కాంట్రాక్ట్‌పై కన్నేశాడు 
సీఎం కిరణ్‌పై సోనియా ద్వారా ఒత్తిడి చేస్తున్నాడు

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: 
బోఫోర్స్ కుంభకోణంలో నిందితులైన సోనియాగాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులు, సన్నిహితులు.. ఇప్పటికీ దేశాన్ని దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు గుప్పించారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ చెల్లెలి మాజీ భర్త వాల్టర్‌విన్సీ ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్ లీజులు కావాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై సోనియా ద్వారా ఒత్తిడి తెస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మైనింగ్ కట్టబెట్టని పక్షంలో బోఫోర్స్ కుంభకోణంలో సోనియా, రాజీవ్‌గాంధీల ప్రమేయానికి సంబంధించిన కీలక సమాచారాన్ని బట్టబయలు చేస్తానని వాల్టర్ కాంగ్రెస్ అధినేత్రిని బెదిరిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. 

వాల్టర్ విన్సీ తరచూ ఆంధ్రప్రదేశ్‌కు వస్తుంటారని, ఆ సమాచారం తన వద్ద ఉందని ఆయన చెప్పారు. గురువారం ఢిల్లీలో ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న సుబ్రమణ్యస్వామి.. అనంతరం ఆయన ఓ టీవీ చానల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. వాల్టర్ విన్సీ ఆంధ్రప్రదేశ్ మైనింగ్‌పై కన్నేశాడంటూ రెండు రోజుల కిందట ట్విట్టర్‌లో పేర్కొన్న అంశానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. పలు ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు క్లుప్తంగా... 

బోఫోర్స్ వ్యవహారంలో క్లీన్ చిట్ ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది?

ఎవరికి క్లీన్ చిట్ ఇచ్చారు? రాజీవ్‌గాంధీ వ్యక్తిగతంగా లంచం తీసుకోలేదనే విషయాన్ని నేను చాలా ముందు నుంచే చెప్తున్నా. కానీ ఆయన కారణంగా ఖత్రోచీని పట్టుకోలేదు. ఆ తర్వాత పి.వి.నరసింహారావు హయాంలోనూ ఖత్రోచీని పట్టుకోలేదు. వాజపేయి కారణంగా ఖత్రోచిని మలేసియా నుంచి తీసుకురాలేకపోయాం. ఖత్రోచిని పట్టుకోవాల్సిందే. ఖత్రోచీ, సోనియా బంధువు వాల్టర్‌విన్సీ ఇద్దరూ డబ్బులు తీసుకున్నారు. వారిని పట్టుకునితీరాల్సిందే. 
ఆంధ్రప్రదేశ్‌లో ఒక కాంట్రాక్టు తీసుకోవాలని వాల్టర్ విన్సీ కోరుతున్నట్టు మీరు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఏమా కాంట్రాక్టు? 

అది.. మైనింగ్ కాంట్రాక్టు కావాలని అనుకుంటున్నారు. ఆయన కిరణ్‌కుమార్‌రెడ్డిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. లేకుంటే బోఫోర్స్ రహస్యం బట్టబయలు చేస్తానని బెదిరిస్తున్నాడు. సోనియాగాంధీ కూడా అతని వల్ల భయపడుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు కాంట్రాక్టు ఇచ్చిందా? ఇవ్వటానికి సన్నాహాలు చేస్తోందా? 
అతనికి కాంట్రాక్టు ఇవ్వటానికి సిద్ధమైంది.. నా ట్వీట్ తర్వాత.. ఆయన కూడా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆగిపోయింది. ఏం జరుగుతుందో చూస్తాను. 

ట్వీట్‌లో విషకన్య అని రాశారు..? 

విషకన్య అనేది సోనియాగాంధీకి కోడ్ పదం. నేను సోనియా పేరును తీసుకోను. 
వాల్టర్ విన్సీకి కాంట్రాక్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై సోనియాగాంధీ ఒత్తిడి తెస్తారని అనుకుంటున్నారా? 

వాల్టర్ విన్సీ వల్ల ఆమె భయపడుతున్నారు. ఆయన ఏదైనా నోరువిప్పితే వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. 

వాల్టర్ విన్సీ ఆంధ్రప్రదేశ్‌పైనే ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? 

అక్కడ మైనింగ్ చేసుకోవచ్చు. ఢిల్లీ నుంచి ఏపీ దూరంగా ఉంది. అక్కడ సులభంగా అక్రమాలు చేయవచ్చు. అందుకే ఆసక్తి చూపిస్తుండవచ్చు. ఆంధ్ర క్రిస్టియన్ మాటా మంతీ ఉంది. క్యాథలిక్ క్రిస్టియన్ లాభాన్ని పొందాలనుకుంటున్నాడు. 

వాల్టర్ విన్సీకి, కిరణ్‌కు పరిచయాలు ఉన్నాయా? 

పరిచయాలు ఉన్నాయా లేదా నేను చెప్పలేను. ఆయన అక్కడ ఉన్నట్టు నాకు తెలుసు. కాంట్రాక్టు అడుగుతున్నాడు. 

భారత్‌లో ఉన్న విన్సీ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తుంటాడా? 

ఆయన చాలా వరకు ఇక్కడే ఉంటాడు. ఏపీకి రాకపోకలు సాగిస్తుంటాడు. ఆయనకేమిటి..? బోఫోర్సు డబ్బు చాలా ఉంది. 

సోనియాను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని మీరు భావిస్తున్నారా? 

నేను చెప్పేశాను కదా. బోఫోర్స్‌కు సంబంధించిన అన్ని విషయాలు విన్సీకి తెలుసు. కాబట్టి సోనియా ఆయనకు భయపడుతున్నారు. 
Share this article :

0 comments: