తిరుమల: రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని మాజీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి అన్నారు. సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 200 పై చిలుకు శాసనసభా స్థానాలతో పాటు, 35 లోక్ సభ స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పడిపోదని తెలిసే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారని విమర్శించారు. రైతుల కోసం మహానేత దివంగత వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతు పలికారని తెలిపారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగనున్న 18 శాసనసభా స్థానాలతో పాటు నెల్లూరు లోక్ సభ స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని
చెప్పారు.
ప్రభుత్వం పడిపోదని తెలిసే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారని విమర్శించారు. రైతుల కోసం మహానేత దివంగత వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతు పలికారని తెలిపారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగనున్న 18 శాసనసభా స్థానాలతో పాటు నెల్లూరు లోక్ సభ స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని
చెప్పారు.
0 comments:
Post a Comment