హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారం అత్యంత పారదర్శకమని, ఈ వ్యవహారంపై నమోదు చేసిన కేసులో తామంతా నిర్ధోషులుగా బయటకు వస్తామనే ధృడసంకల్పం ఉందని ఆడిటర్ వేణుంబాకం విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో 103 రోజుల జైలు జీవితం తర్వాత సాయిరెడ్డి విడుదలయ్యారు. శనివారం ఆయన నివాసం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. న్యాయవ్యవస్థపై తనకు
విశ్వాసం ఉందని, తమ నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుంటామని తెలిపారు. జైలు జీవితం బయట అనుకున్నంత సంతోషకరంగా ఉండదని, జెలు జీవితం చాలా కష్టంగా, దుర్భరంగా ఉంటుందని, జైలుకు వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. బెయిల్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులను కలుసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
0 comments:
Post a Comment