బెజవాడలో జనసునామీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బెజవాడలో జనసునామీ

బెజవాడలో జనసునామీ

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012

ఇద్దరు యువనేతల కలయికతో బెజవాడలో జనసునామీ వచ్చిందని జక్కంపూడి విజయలక్ష్మీ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమక్షంలో ఈరోజు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ లాగే ఈరోజు జగన్ ప్రజల కష్టాలు తెలుసుకున్నారని చెప్పారు. జగన్ ని బయటకు పంపినందుకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు లెంపలేసుకుంటున్నారన్నారు.


ఏలూరు: నరసాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తొలివిడత ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఆకివీడులో సమ్మె చేస్తున్న ఐకేపీ యానిమేటర్లతో జగన్ మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే 3 వేల రూపాయల జీతం ఇస్తామని ఐకేపీ యానిమేటర్లకు జగన్ హామీ ఇచ్చారు.
Share this article :

0 comments: