దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు ఆరోపించారు. ఇందులో భాగంగానే మంత్రి కొండ్రు మురళి వైఎస్పై ఆరోపణలు చేస్తున్నారని గోనె మండిపడ్డారు. మంత్రి పదవి కోసం అప్పుడు వైఎస్ భజన, ఇప్పుడు కిరణ్ భజన కొండ్రు మురళి నైజమని ఆయన అన్నారు.
రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తే అప్పుడు ఆయన భజన చేసేందుకు కొండ్రు మురళి సిద్ధంగా ఉంటారని గోనె మీడియాతో అన్నారు. విశాఖలో రూ.150కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు కొట్టేసిన ఘనుడు కొండ్రు మురళి అంటూ..దళితుల మీద ప్రేమ ఉంటే ఆభూమిని దళిత కుటుంబాలకే పంచాలని ఆయన సవాలు విసిరారు. ఏనాడు దళితుల కోసం మాట్లాడని కొండ్రు మురళి ఇప్పుడు మాట్లాడడం వెనుక ఖచ్చితంగా కుట్ర ఉందని గోనె ఫైర్ అయ్యారు.
రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తే అప్పుడు ఆయన భజన చేసేందుకు కొండ్రు మురళి సిద్ధంగా ఉంటారని గోనె మీడియాతో అన్నారు. విశాఖలో రూ.150కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు కొట్టేసిన ఘనుడు కొండ్రు మురళి అంటూ..దళితుల మీద ప్రేమ ఉంటే ఆభూమిని దళిత కుటుంబాలకే పంచాలని ఆయన సవాలు విసిరారు. ఏనాడు దళితుల కోసం మాట్లాడని కొండ్రు మురళి ఇప్పుడు మాట్లాడడం వెనుక ఖచ్చితంగా కుట్ర ఉందని గోనె ఫైర్ అయ్యారు.
0 comments:
Post a Comment