బాబు బాటలో కిరణ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు బాటలో కిరణ్

బాబు బాటలో కిరణ్

Written By news on Thursday, April 12, 2012 | 4/12/2012

టీడీపీ అధినేత చంద్రబాబు బాటలోనే సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి నడుస్తున్నారని మరోసారి రుజువైంది. అప్పట్లో చంద్రబాబు నాయుడు నీరు-మీరు కార్యక్రమం కింద ఇంకుడు గుంతలు పేరుతో వందల కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కిరణ్ సర్కారు కూడా ఇంకుడు గుంతలంటోంది. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపథం కార్యక్రమంలో ఇంకుడు గుంతలు (వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు)కు ప్రాధాన్యత ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం ఉపాధి హామీ పథకం నిధులు కలిపి మొత్తం రూ.800 కోట్ల వరకు వ్యయం చేయనుంది. ప్రజాపథం ఏర్పాట్లపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల కలెక్టర్లు మంచినీటి ఎద్దడి నివారణకు నిధులు కొరత ఉందని సీఎం దృష్టికి తెచ్చారు. ఇందుకోసం 105 కోట్ల రూపాయలు అవసరం ఉండగా 45 కోట్ల రూపాయలనే విడుదల చేశారని తెలిపారు. మహిళా సంఘాల పావలా వడ్డీ బకాయి నిధులను వెంటనే విడుదల చేస్తామని సీఎం తెలిపారు.
Share this article :

0 comments: