రాక్షసులకు ప్రతిరూపం చంద్రబాబే!: పద్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాక్షసులకు ప్రతిరూపం చంద్రబాబే!: పద్మ

రాక్షసులకు ప్రతిరూపం చంద్రబాబే!: పద్మ

Written By news on Monday, April 30, 2012 | 4/30/2012

టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ఒక ఉన్మాదిలాగా మారిపోయి వైఎస్సార్ కాంగ్రెస్‌పైనా, వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిపైనా అవాకులు చవాకులు పేలుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌ను గజదొంగల పార్టీ అనీ, రాష్ట్రంలో రాక్షసులు పుట్టారనీ చంద్రబాబు మతి భ్రమించి విమర్శలు చేస్తున్నారనీ వాస్తవానికి ఆయనే రాక్షసులందరి ప్రతి రూపమనీ విమర్శించారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో బాబు రాక్షస రూపం ఎలా ఉంటుందో ప్రజలింకా మర్చి పోలేదనీ అందుకే ఏ ఎన్నికలొచ్చినా ఆయన్ను ఓడిస్తూ వస్తున్నారనీ ఆమె అన్నారు. 

ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు డిపాజిట్లు రావనీ అన్ని సీట్లలోనూ ఓడి పోతారని బాబు ప్రచారం చేస్తున్నారనీ మరి 18 సీట్లలో మా పార్టీ విజయం సాధిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని పద్మ సవాలు విసిరారు. నిన్నటి దాకా లక్ష కోట్లు, యాభై వేల కోట్లు జగన్ దోచుకుని వాటిని దాచుకోవడానికే రాజకీయాలు చేస్తున్నారని ఇష్టానుసారం ఆరోపణలు చేసిన బాబు ఇపుడు తాజాగా గజదొంగ అనీ దిగజారుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండి పడ్డారు. అసలు రాష్ట్రంలో రాజకీయాలు దిగజారడం ప్రారంభం అయింది చంద్రబాబు హయాంలో నుంచేననీ డబ్బు ప్రభావం ఎన్నికల్లో ఎక్కువ కావడానికి ఆద్యుడు కూడా ఆయననేననీ ఆమె అన్నారు. ఏపీ ఎన్నిక ల్లో అయ్యే ఖర్చు చూసి జాతీయ స్థాయిలోనే బాబోయ్ అన్న పరిస్థితి బాబు పాలనలోనే నెలకొందని ఆమె అన్నారు. రాష్ర్టంలో మీడియాతో సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిన ఘనత బాబుదేనని ఆమె పేర్కొన్నారు. 

వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన భూకేటాయింపుల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ఏనాడైనా ఎన్టీఆర్ ట్రస్టు గురించి వాస్తవాలు చెప్పారా? అని నిలదీశారు. ‘ఎన్టీఆర్ ట్రస్టుకు మీరే ఛైర్మన్‌గా ఉంటారు...ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు...ముఖ్యమంత్రి హోదాలో ట్రస్టుకు భూమిని కేటాయిస్తారు... ట్రస్టు పేరు చెప్పి విదేశాల్లో దండిన డబ్బులు టీడీపీకి మళ్లించుకుంటారు...ఇన్ని చేసిన మీరు ట్రస్టుకు సంబంధించిన విషయాలు ఎన్నడైనా వెల్లడించారా?’ అని పద్మ నిలదీశారు. ఐఎంజీ భారత, జీఎమ్మార్ సంస్థలకు మీరు కేటాయించిన భూముల్లో ఎన్ని కోట్లు చేతులు మారాయో చెప్పండి. విశాఖపట్టణంలో టీడీపీ ఎంపీగా ఉండిన మూర్తికి వేలాది ఎకరాలు కేటాయించిన ఉదంతంలో ఎంత డబ్బు తీసుకున్నారో చెప్పండి అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఏనాడూ ఆలోచించని రాక్షసుడు చంద్రబాబు అని ఆమె దుయ్యబట్టారు. ఎన్నడైనా ప్రజల సమస్యలపై మనసు పెట్టి ఆలోచించారా అని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే డబ్బు కోసం మరణిస్తున్నారని చెప్పిన రాక్షసుడు చంద్రబాబు అని ఆమె అన్నారు. 

తెహల్కా స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడిన బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ జైలుకు వెళ్లడాన్ని హర్షం వ్యక్తం చేసిన బాబు తన సంగతేమిటో కూడా గుర్తు చేసుకుంటే మంచిదని ఆమె అన్నారు. ఇదే తెహల్కా.డాట్ కామ్ 2002 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజకీయ వేత్త చంద్రబాబు అని ప్రచురించిన విషయానికి ఏం సమాధానం చెబుతారని ఆమె నిలదీశారు. తన పాలన చాలా గొప్పదని చంద్రబాబు చెప్పుకోవడాన్ని ఆమె ఎద్దేవా చేశారు. ‘మీరేమైనా రాముడికి వారసులా...మీదేమైనా రాముడి పాలనా...ప్రజలు గుర్తుంచుకోవడానికి? మీ పాలనలో ప్రతి పేజీ కూడా రక్త చరిత్రే కదా! 

విద్యుత్ చార్జీలు తగ్గించమన్నందుకు బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకోలేదా? తమ వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన విషయం బాబు మరిచారా? బాబు మర్చి పోయి ఉండవచ్చు కానీ...ఆ రాక్షస పాలన తాలూకు ఛాయలు ప్రజలను ఇంకా వెంటాడుతున్నాయి’ అని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన కేసుల్లో అక్రమమో, సక్రమమో ఏ కోర్టూ తేల్చక ముందే అక్రమాస్తులంటూ ఆయనకు ఆపాదిస్తున్నారని ఆమె ఈనాడు పత్రికాధిపతిని తప్పు పట్టారు. వాస్తవానికి రాష్ట్రంలో అక్రమ ఆస్తులకు చిరునామా రామోజీరావేనని ఆమె విమర్శించారు. రామోజీ ఫిలింసిటీలో 1300 ఎకరాల పట్టాభూముల, అసైన్డ్ భూములు ఉన్నాయనీ వాటిని భూమి ట్రిబ్యునల్ అక్రమమమని తీర్పు నిచ్చిందనీ ఆమె పేర్కొన్నారు. పాల్మాకుల వద్ద 60 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా రామోజీ ఆధీనంలో ఉంటే దాని మాటేమిటని ఆమె ప్రశ్నించారు. రామోజీరావు అడ్డగోలుగా రాస్తూ తాను చెప్పిందే ప్రజలు నమ్మాలనుకుంటే కుదరదనీ తాము ఈ పరిస్థితిని తప్పకుండా ఎదుర్కొంటామని ఆమె అన్నారు.
Share this article :

0 comments: