రాధని తమ్ముడిలా గుండెల్లో చేర్చుకుంటా:జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాధని తమ్ముడిలా గుండెల్లో చేర్చుకుంటా:జగన్

రాధని తమ్ముడిలా గుండెల్లో చేర్చుకుంటా:జగన్

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012


మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున తన అభిమానులతో తరలివచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తమ్ముడిగా రాధని పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రకటించారు. రాముడు లక్ష్మణుడిని ఏ విధంగా చూశారో అదేవిధంగా రాధని తను గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. వంగవీటి మోహన రంగా, వైఎస్ఆర్ మధ్య ఉన్న స్నేహమే ఈరోజు తమని కలిపిందన్నారు. వారి స్నేహం తమతో పునరావృతం అయిందన్నారు.

బందరు పోర్టు కోసం నిర్వహించే ఆందోళన కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగా ఉంటుందని తెలిపారు. ఒక వేళ ఈ ప్రభుత్వం బందరు పోర్టుకు అనుమతి ఇవ్వకపోతే తాము అధికారంలోకి రాగానే రెండేళ్లలో పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. నాన్న పేదవాడికి గజం స్థలం 100 రూపాయలకే ఇచ్చారు. ఆ స్థలం ఇప్పుడు 45 వేల రూపాయలు అయింది. రాబోయే సువర్ణయుగంలో గజం స్థలం 50 రూపాయలకే ప్రతి పేదవానికి ఇస్తామని చెప్పారు. ఈ ఆప్యాయతలకు ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేనన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనం తరలి వచ్చారు.

Share this article :

0 comments: