వైఎస్సార్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అమరనాథ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డిలకు గన్మెన్లను సమకూర్చాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. భద్రతా సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పోలీసుశాఖ తమ గన్మెన్లను తొలగించిందని ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు హైకోర్టుకు నివేదించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని కోర్టుకు తెలిపారు. తాము మళ్లీ జనంలోకి వెళ్లి ప్రజాతీర్పును కోరాల్సిన పరిస్థితుల్లో గన్మెన్లను ఉపసంహరించడం వల్ల స్వేచ్ఛగా తిరగలేమని, ఇది తమ హక్కులను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వారికి గన్మెన్లను పునరుద్ధరించాలని ఆదేశించారు. అయితే గన్మెన్ల ఖర్చును మాత్రం మాజీ ఎమ్మెల్యేలే భరించాలని, వారి భద్రతకు ఎలాంటి ముప్పులేదని భావించేంతవరకు గన్మెన్లను ఉపసంహరించవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Home »
» శ్రీనివాసులు, అమరనాథ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డిల పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం
శ్రీనివాసులు, అమరనాథ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డిల పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం
Written By news on Saturday, April 14, 2012 | 4/14/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment