ఢిల్లీ పెద్దల దిమ్మతిరగేలా ఉపఎన్నికల ఫలితాలు ఉండాలని వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడొద్దని తనపై ఒత్తిడి తెచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయాల్లో మాట ఇవ్వడం.. తప్పడం సాధారణమని, ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చారన్నారు.
అధిష్టానం మాట వింటే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు ఆశపెట్టారని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేలను తన వెంట రావద్దని చెప్పిన విషయాన్ని ప్రజల దృష్టికి జగన్ తీసుకువచ్చారు. పేద ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీ పథకం నుంచి 135 వ్యాధులను తొలగించారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అధిష్టానం మాట వింటే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు ఆశపెట్టారని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేలను తన వెంట రావద్దని చెప్పిన విషయాన్ని ప్రజల దృష్టికి జగన్ తీసుకువచ్చారు. పేద ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీ పథకం నుంచి 135 వ్యాధులను తొలగించారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment