పాయకరావుపేటలో ప్రచారానికి జగన్ శ్రీకారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాయకరావుపేటలో ప్రచారానికి జగన్ శ్రీకారం

పాయకరావుపేటలో ప్రచారానికి జగన్ శ్రీకారం

Written By news on Thursday, April 19, 2012 | 4/19/2012


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని విశాఖ జిల్లాలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కశింకోట ఆర్ ఈసీఎస్ అతిథి గృహం నుంచి ఆయన గురువారం ప్రచారానికి బయల్దేరారు. తొలుత జగన్ కొర్రప్రోలులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

వైఎస్ జగన్ ఈ ఏడాది ఫిబ్రవరి తొలి వారంలో రెండు రోజులుపాటు నియోజకవర్గంలో పర్యటించడం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ పల్లెలను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి, పదవికి రాజీనామా చేసిన గొల్ల బాబూరావును ఎప్పుడు ఎన్నికలొచ్చినా అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరారు.

తొలుత ఒక్కరోజు అనుకున్న పర్యటన అశేష ప్రజల ఒత్తిడితో రెండ్రోజులకు పెరిగింది. అయినప్పటికీ జన నేతను చూడాలనుకున్న చాలా గ్రామాల ప్రజల కోరిక తీరలేదు. ఈసారి రెండురోజులపాటు మిగిలిన గ్రామాల్లో పర్యటించి ప్రజలను పలకరించనున్నారు. జగన్ రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.
Share this article :

0 comments: