ఎమ్మార్ తెలుసు... శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎమ్మార్ తెలుసు.. మన పార్టీలో ఈ జీఎమ్మార్ ఎవరబ్బా.. కోటరీలో కొత్త కేరక్టరా!! అని టీడీపీ తమ్ముళ్లు కంగారు పడ్డారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ధర్నా చేసిన చంద్రబాబు అటు నుంచి అటే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. వెళుతూ వెళుతూ నేనూ, జీఎమ్మార్ కలిసి వెళుతున్నామని చెప్పారట. దీంతో తమ్ముళ్లలో కంగారు పుట్టింది. జీఎమ్మార్ అంటే శంషాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎమ్మారేనా.. లేక కొత్త కేరక్టరా అని లోతుగా విచారించగా.. పార్టీ ప్రధాన కార్యదర్శి, పారిశ్రామికవేత్త కూడా అయిన గరికపాటి మోహన్రావని తేలిందట. సాధారణంగా చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ఎవరికీ చెప్పరు. ఎవరితో కలిసి వెళుతున్నారన్న విషయం మరొకరికి తెలియనీయరు. ఒకవేళ తెలియాలని అనుకున్నా.., తెలిసీ తెలియని విధంగా, అస్పష్టంగా చెప్పి, ఎదుటి వారు గందరగోళ పడే విధంగా చేస్తుంటారని పార్టీలో అందరూ చెప్పుకుంటారు. బుధవారంనాడు కూడా గరికపాటిని తీసుకెళ్తున్న విషయం సూటిగా చెప్పేందుకు ఇష్టపడకే జీఎమ్మార్తో కలిసి వెళుతున్నానని చెప్పారట. పార్టీలో అవసరాన్నిబట్టి పారిశ్రామికుల పేర్లను ఆ రకంగా బాబు వాడుతుంటారని, అదే ఆయన వ్యాపార రహస్యమని చెవులు కొరుక్కుంటున్నారు.
Home »
» ఆ జీఎమ్మార్ ఎవరో...?
ఆ జీఎమ్మార్ ఎవరో...?
Written By ysrcongress on Saturday, April 7, 2012 | 4/07/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment