ఎవరు ఎన్ని వ్యూహాలు పన్నినప్పటికీ ఎన్నికల సంఘం మంచి నిర్ణయం తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలు వాయిదా వేయించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలు రావని అనుకున్నారని, ఎన్నికలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థకు ప్రాముఖ్యత ఉందని తెలిపారు.
మహానేత డాక్టర్ వైఎస్ పాలనలో పాపాలు జరిగినట్లు ఎంపి పాల్వాయి గోవర్దన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. వైఎస్ పాలనలో పాపాలు జరిగినట్లు ఒక తీర్మానం చేయాలని అంబటి సవాల్ చేశారు.
మహానేత డాక్టర్ వైఎస్ పాలనలో పాపాలు జరిగినట్లు ఎంపి పాల్వాయి గోవర్దన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. వైఎస్ పాలనలో పాపాలు జరిగినట్లు ఒక తీర్మానం చేయాలని అంబటి సవాల్ చేశారు.
0 comments:
Post a Comment