వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం నుంచి రెండు రోజులపాటు పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రైతుల కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకుని వచ్చే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గొల్ల బాబూరావు విజయం కోసం ఆయన ప్రచారం చేయనున్నారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నాలుగు రోజుల ప్రచార యాత్ర ముగించుకుని జగన్ బుధవారం రాత్రి కశిం కోట చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేశారు. గురువారం ఉదయం 9.30 గంటలకు కశింకోట నుంచి ప్రచార యాత్ర ప్రారంభిస్తారు. రాత్రికి వేంపాడ మీదుగా నక్కపల్లి చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. మరునాడు ఉదయం నక్కపల్లి నుంచి ప్రచారం మొదలుపెడతారు. పలు గ్రామాల్లో పర్యటించి రాత్రికి ఎస్.నరసాపురం చేరుకుంటారు. అక్కడితో యాత్రను ముగిస్తారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నాలుగు రోజుల ప్రచార యాత్ర ముగించుకుని జగన్ బుధవారం రాత్రి కశిం కోట చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేశారు. గురువారం ఉదయం 9.30 గంటలకు కశింకోట నుంచి ప్రచార యాత్ర ప్రారంభిస్తారు. రాత్రికి వేంపాడ మీదుగా నక్కపల్లి చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. మరునాడు ఉదయం నక్కపల్లి నుంచి ప్రచారం మొదలుపెడతారు. పలు గ్రామాల్లో పర్యటించి రాత్రికి ఎస్.నరసాపురం చేరుకుంటారు. అక్కడితో యాత్రను ముగిస్తారు.
0 comments:
Post a Comment