‘చెయ్యి ఊపి వెళ్లిపోయే నాయకుల్నే చూశాం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘చెయ్యి ఊపి వెళ్లిపోయే నాయకుల్నే చూశాం’

‘చెయ్యి ఊపి వెళ్లిపోయే నాయకుల్నే చూశాం’

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012


మండావారిపేట (నరసాపురం టౌన్), న్యూస్‌లైన్: ‘అన్నా..! చెయ్యి ఊపి వెళ్లిపోయే నాయకులనే ఇప్పటివరకూ చూశాం. మనిషి కనిపించగానే దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరించి జనం కష్టాలను అడిగి తెలుసుకుంటున్న నాయకుణ్ణి నిన్నే చూస్తున్నామన్నా’ అంటూ పలువురు మహిళలు, యువతులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానాన్ని చూపించారు. ‘అన్నా.. నువ్వే ముఖ్యమంత్రి కావాలి. మా కష్టాలు తెలిసిన నువ్వు సీఎం అయితేనే మా రోజులు బాగుంటాయి’ అని పేర్కొన్నారు. నరసాపురం మండలంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజైన గురువారం జగన్‌మోహన్‌రెడ్డి సర్దుకొడప నుంచి రోడ్ షో నిర్వహించారు. మండావారిపేటలో మహిళలు, యువతులు పెద్దసంఖ్యలో ఆయన కోసం వేచివున్నారు. ఇటీవల టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ఈ ప్రాంతంలో పర్యటించారు. జనాన్ని చూసి చెయ్యి ఊపుతూ వెళ్లిపోయారు.

జగన్‌మోహన్‌రెడ్డి కూడా అలాగే వెళ్లిపోతారని అక్కడి వారంతా అనుకోగా, ఆయన మాత్రం ఎవరు కనిపించినా కారు దిగి దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. దీంతో వారి ఆనందం అవధులు దాటింది. అక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. దేవిని వెంకటరత్నం అనే వృద్ధురాలు మాట్లాడుతూ తనకు ప్రభుత్వం ఇచ్చే అభయహస్తం పింఛను రూ.500 సరిపోవడం లేదని తెలిపింది. ఏమని ధనలక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని నిట్టూర్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు తమకు ఎలాంటి ఆందోళన ఉండేది కాదని పాలా లక్ష్మి చెప్పింది. వారి కష్టాలను విన్న జగన్‌మోహన్‌రెడ్డి ‘అందరికీ మంచి రోజులు వస్తాయి. వైఎస్ నాటి స్వర్ణయుగం త్వరలోనే వస్తుంది’ అంటూ వారిలో ధైర్యం నింపారు. దీంతో మహిళలు ‘అన్నా.. నువ్వే ముఖ్యమంత్రి కావాలి’ అంటూ నినాదాలు చేశారు. దీనికి జగన్‌మోహన్‌రెడ్డి చిరునవ్వుతో స్పందిస్తూ... ‘వెళ్లొస్తా అవ్వ.. వెళ్తున్నా చెల్లెమ్మలు తమ్ముళ్లూ అంటూ ముందుకు కదిలారు. 


Share this article :

0 comments: