నరసన్నపేట: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు ఒక పక్క తూట్లు పొడుస్తూ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి మహిళలపై ప్రేమ కురిపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాత్రి 7 గంటలకు ఇక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ఆవేశంగా ప్రసంగించారు. ఉప ఎన్నికలలో వేసే ఓటుతో కుళ్లు, కుతంత్రాలు
చేసేవారికి దిమ్మతిరగాలని పిలుపు ఇచ్చారు.
'108 వాహనాలను మూల పడవేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంటుని అటకెక్కించారు. వ్యవసాయంకన్నా ఉరి వేసుకోవడం మేలని రైతులు భావిస్తున్నారు' అని బాధపడ్డారు. రైతన్నల కోసం, పేదల కోసం పదవులు వదులుకున్న 17 మంది ఎమ్మెల్యేలకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు.
చేసేవారికి దిమ్మతిరగాలని పిలుపు ఇచ్చారు.
'108 వాహనాలను మూల పడవేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంటుని అటకెక్కించారు. వ్యవసాయంకన్నా ఉరి వేసుకోవడం మేలని రైతులు భావిస్తున్నారు' అని బాధపడ్డారు. రైతన్నల కోసం, పేదల కోసం పదవులు వదులుకున్న 17 మంది ఎమ్మెల్యేలకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు.
0 comments:
Post a Comment