వైఎస్ ఆశయాల్ని సాధించేందుకే: గుర్నాథరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ ఆశయాల్ని సాధించేందుకే: గుర్నాథరెడ్డి

వైఎస్ ఆశయాల్ని సాధించేందుకే: గుర్నాథరెడ్డి

Written By news on Thursday, April 12, 2012 | 4/12/2012



అనంతపురం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల్ని సాధించేందుకే పెద్దఎత్తున వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో కార్యకర్తలు చేరుతున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అన్నారు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా గుర్నాథరెడ్డి మాట్లాడుతూ.. ఏనాడు అభివృద్ధిని పట్టించుకోని మంత్రులు, ఎంపీలు, ఉపఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు ఇష్టానుసారం పనులు కేటాయిస్తున్నారు అని అన్నారు. అభివృద్ధి ముసుగులో కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపుతున్నారని గుర్నాథరెడ్డి విమర్శించారు. అనంతపురం, బళ్లారి సరిహద్దుల్లో మైనింగ్ స్మగ్లింగ్‌ను ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఉపఎన్నికల్లో కోట్లు పంచేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు సిద్ధమవుతున్నారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను విమర్శిస్తున్నవారు దమ్ముంటే రాజీ నామా చేసి మళ్లీ గెలవాలని మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి సవాల్ విసిరారు. ఉపఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే అధికారపార్టీ నేతల ప్రలోభాలు మొదలయ్యాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆభ్యర్థుల విజయం తథ్యం శంకర్ నారాయణ అన్నారు.
Share this article :

0 comments: